మల్యాల అంగన్వాడి కేంద్రంలో వేదపండితుల ఆశీర్వచనాలతో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
అక్షరాభ్యాసం ప్రతి చిన్నారి జీవితంలో ఒక పవిత్రమైన ఘట్టమని,విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని మల్యాల గ్రామ సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలం, మల్యాల గ్రామ అంగన్వాడి కేంద్రంలో గురువారం రోజున వేదపండితుల మంత్రోచ్చారణలు, ఆశీర్వచనాల నడుమ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం గ్రామ సర్పంచ్ దొమ్మట రమాదేవి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కుమార్తె మరియు చిన్నారులు విద్యాదేవి సరస్వతి ఆశీస్సులతో తమ విద్యా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు ఆశీర్వాదాలు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్నారులు విద్యలో రాణించి గ్రామానికి,తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మైలారం సుదర్శన్, వార్డు మెంబర్లు మచ్చల లావణ్య రాజు,జూపల్లి లత శ్రీరాములు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు,లకడబోయిన మహేందర్, మహిళలు,గ్రామ పెద్దలు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.