BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

తునికిపాడులో పొలం గట్టు వివాదం.. హత్యాయత్నం కేసులో ఐదుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
16 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో పొలం గట్టు వివాదం హత్యాయత్నానికి దారితీసిన ఘటనలో ఐదుగురు నిందితులను గంపలగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. భూ సరిహద్దు విషయంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 23న పొలం గట్టు అంశంపై జరిగిన వివాదం అనంతరం, జూన్ 24 తెల్లవారుజామున నిందితులు కర్రలు, రోకలి బండతో బాధితుడు బిక్షాలు ఇంటి వద్దకు వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడికి తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 73/2026గా బీఎన్‌ఎస్ సెక్షన్లు 329(4), 109(1) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులుగా గుర్తించిన వేల్పుల అజయ్, వేల్పుల గోపి, వేల్పుల చిన్ని కృష్ణ, వేల్పుల అనిల్, వేల్పుల చిట్టిబాబులను గురువారం ఉదయం భగవానులపురం ఎక్స్‌రోడ్ వద్ద ఎస్‌ఐ కె. శశిధర్ నేతృత్వంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నిందితులను తిరువూరులోని II అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ జేఎఫ్‌సీఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలను చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని గంపలగూడెం పోలీసులు హెచ్చరించారు.