BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తునికిపాడులో పొలం గట్టు వివాదం.. హత్యాయత్నం కేసులో ఐదుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
68 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో పొలం గట్టు వివాదం హత్యాయత్నానికి దారితీసిన ఘటనలో ఐదుగురు నిందితులను గంపలగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. భూ సరిహద్దు విషయంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 23న పొలం గట్టు అంశంపై జరిగిన వివాదం అనంతరం, జూన్ 24 తెల్లవారుజామున నిందితులు కర్రలు, రోకలి బండతో బాధితుడు బిక్షాలు ఇంటి వద్దకు వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడికి తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 73/2026గా బీఎన్‌ఎస్ సెక్షన్లు 329(4), 109(1) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులుగా గుర్తించిన వేల్పుల అజయ్, వేల్పుల గోపి, వేల్పుల చిన్ని కృష్ణ, వేల్పుల అనిల్, వేల్పుల చిట్టిబాబులను గురువారం ఉదయం భగవానులపురం ఎక్స్‌రోడ్ వద్ద ఎస్‌ఐ కె. శశిధర్ నేతృత్వంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నిందితులను తిరువూరులోని II అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ జేఎఫ్‌సీఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలను చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని గంపలగూడెం పోలీసులు హెచ్చరించారు.