BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
25 Jun, 2026 - 07:22 PM
211 వీక్షణలు

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల ప్రతిజ్ఞ

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం భాగస్వాములు కావాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  పిలుపునిచ్చారు. రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో గురువారం నార్కట్‌పల్లి పరిధిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రత్యేక అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.​ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ. డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం కేవలం ఒక వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా, వారి కుటుంబాలను, మొత్తం సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వివరించారు. ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులంతా కలిసి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ  ​నో టు డ్రగ్ - ఎస్ టూ లైఫ్   అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ అవగాహన సదస్సులో మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్, నార్కట్‌పల్లి సీఐ సురేష్, ఎస్సై విష్ణు మూర్తి పాటు యూనివర్సిటీ విద్యార్థులు, వర్సిటీ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.