BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మల్లికార్జున స్వామికి వైభవంగా పాగాలంకరణ

తెలంగాణ
15 Feb, 2026 - 11:35 PM
211 వీక్షణలు
  శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి వైభవంగా పాగాలంకరణ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో మల్లికార్జున స్వామికి పాగాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన అనంతరం పాగాలంకరణ ఆచారం సంప్రదాయబద్ధంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాల్లో జరిగే ఈ పాగాలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వివాహ వేడుకల్లో వరుడికి తలపాగ చుట్టే సంప్రదాయానికి ప్రతీకగా ఈ ఆచారం కొనసాగుతోంది. గర్భగుడి విమాన శిఖరం నుంచి ముఖ మండపంలోని నందివిగ్రహాల వరకు పాగాను అనుసంధానం చేస్తూ అలంకరించడం ఈ కార్యక్రమంలోని విశిష్టతగా భావించబడుతుంది. భక్తులు నియమ నిష్ఠలతో సంవత్సరంలో 365 మూరల పొడవుతో పాగాను నేస్తారు. పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరంగా సేవ నిర్వహించాల్సి ఉండటంతో, ఆ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. సంపూర్ణ చీకటిలో ఈ అలంకరణ చేయడం విశేష నైపుణ్యంతో కూడుకున్నదిగా భావించబడుతుంది. రాత్రి 10 గంటల నుంచి ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ సుబ్బారావు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు భక్తులు సమర్పించిన పాగాలను స్వామివారికి అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. #Srisailam #MallikarjunaSwamy #Pagalankarana #Mahashivaratri2026 #TempleTradition Follow us on Website Facebook Instagram YouTube