మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం
మంచిర్యాల: ఎండదెబ్బ నుంచి ప్రజలకు ఊరట.. "దివాకర్ అన్న పెరుగన్నం" ప్రారంభం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి (IB) చౌరస్తాలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దివాకరన్న పెరుగన్నం’ కేంద్రాన్ని ట్రస్ట్ చైర్మన్ మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని (పెరుగన్నం పంపిణీ కేంద్రం) ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, బిఆర్ఎస్ మంచిర్యాల మాజీ అధ్యక్షులు గాదె సత్యం, నస్పూర్ పట్టణ మాజీ అధ్యక్షులు అక్కూరి సుబ్బన్న పాల్గొన్నారు. అలాగే కార్పొరేటర్లు గుమ్మడి శ్రీనివాస్, అబ్దుల్ సత్తార్, పెట్టాం స్వరూప-లక్ష్మణ్, నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, మంచిర్యాల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, TBGKS నాయకులు కేతేరెడ్డి సురేందర్ రెడ్డి మరియు పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు సేవలందించే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు