మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్లో టికెట్ల అక్రమ దందా
మంచిర్యాల నస్పూర్ లోని ఎగ్జిబిషన్లో టికెట్ల దందా
రేటు లేకుండానే ఇష్టారాజ్యంగా వసూలు
ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తన | అధికారుల తనిఖీలకు డిమాండ్
మంచిర్యాలలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరుగుతున్న కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్లో టికెట్ల అక్రమ దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు; [ధరల్లేని టికెట్లు - ఇష్టారాజ్యంగా వసూళ్లు]: నిర్వాహకులు రైడ్స్ టికెట్లపై కనీస ధర ముద్రించకుండా ఒకే రైడ్కు కొందరి వద్ద రూ.50, మరికొందరి వద్ద రూ.100 వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు, దీనిపై ప్రశ్నించిన సందర్శకులతో సిబ్బంది సైతం దురుసుగా ప్రవర్తిస్తున్నారు; వైరల్ ఫోటోలు - అధికారుల నిర్లక్ష్యం ధర లేని టికెట్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినా, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఈ దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు; తక్షణ చర్యలకు డిమాండ్ తూనికలు, కొలతల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, టికెట్లపై ధరలు ముద్రించేలా నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు