మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం
మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి భవిష్యత్ ప్రణాళికలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తూ, సంస్థాగత బలోపేతానికి కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పార్టీ స్థితిగతులు మరియు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీర్మానించారు