www.ntodaynews.com
మంచిర్యాలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ
మంచిర్యాలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
మంచిర్యాలలో బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం నస్పూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని, స్వరాష్ట్రంలో ఆయన సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, TBGKS నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు