BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 May, 2026 - 02:04 PM
57 వీక్షణలు

​మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం

మంచిర్యాల: కార్మిక హక్కుల సాధనకు పోరాటమే ఏకైక మార్గమని తెలంగాణ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సు డ్రైవర్ల సంఘం పిలుపునిచ్చింది. మే డే సందర్భంగా మంచిర్యాలలోని గాంధీ పార్క్ వద్ద సంఘం మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు టి. జైపాల్ సింగ్ మాట్లాడుతూ... 140 ఏళ్ల క్రితం 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికుల రక్తతర్పణం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని, అదే స్ఫూర్తితో నేటి కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాలని కోరారు.

​ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, క్లీనర్లు, అటెండర్లు, ఆయాలు, సెక్యూరిటీ గార్డులు చాలీచాలని జీతాలతో, జీవో ప్రకారం వేతనాలు అందక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మాదిరిగానే, ఇప్పుడు కూడా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు మల్లేష్, కమిటీ సభ్యులు వెంకటేశ్వరావు, చంద్రయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు