మండలంలో సాధారణ సర్వ సభ్య సమావేశం
మండలంలో సాధారణ సర్వ సభ్య సమావేశం
గురువారం ఎంపిపి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఎంపిపి రమణారెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు గజ్జల సీతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయా శాఖల అధికారులతో, ప్రజాప్రతినిధులతో రమణారెడ్డి లతీఫ్ ఖాన్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, రాబోయే రోజుల్లో వర్షాకాలం రైతులకు సబ్సిడీ విత్తనాలు కొరత లేకుండా చూడాలని ఏ వో జాఫర్ కు తెలియజేసారు, విద్యుత్ సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు, విద్యశాఖ పై ఎం ఈ వో హేమలత ను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఉచిత భోజనం తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15000 వేలు ప్రభుత్వం అందిస్తున్నారని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి కృషి చేయాలని, గ్రామాల్లోని పాఠశాల భవనాలు అంగన్వాడీ సూపర్ వైజర్ రమాదేవి తో మాట్లాడుతూ చిన్న పిల్లలు, గర్భణీ స్త్రీ లపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమెకు తెలియజేసారు, పంచాయతీ కార్యదర్శుల తో మాట్లాడుతూ ఎక్కడా కూడ త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, వీధిలైట్ల నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతి కార్యదర్శులకు తెలియజేసారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపిపి రమణారెడ్డి ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, సింగిల్ విండో అధ్యక్షులు గజ్జలసీ తయ్య ఎంపిడిఓ 1అన్నపూర్ణ, డిప్యుటీ ఎంపిడిఓ కృష్ణవేణి, ఏ పీ ఎం మాధవి, ఏపీ వో జాఫర్ అంగన్వాడీ సూపర్ వైజర్ రమాదేవి, హౌసింగ్ రాజేశ్వరి, పంచాయతీ కార్యద ర్శులు వైస్ ఎంపిపి గంగాధర్ నాయుడు, ఎంపీటీసీలు, శైలజ రాధారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, పద్మావతి, ఎంపిడిఓ కార్యాలయసిబ్బంది పాల్గొన్నారు.