కాంగ్రెస్ విడిచి బిఆర్ఎస్లో చేరిన నాయకులు
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్
శనివారం జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్
దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం లక్ష్మిదేవి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ మరియు వారి 50 మంది అనుచరులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే ధర్మానాయక్ తండా నుండి చందు నాయక్ మరియు వారి 10 మంది అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో విసుగు చెంది మళ్లీ కేసీఆర్ వస్తేనే పల్లెలు మరియు తండాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీని విడిచి బిఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే స్థాయిని మరిచిపోయి సోయి తప్పి అరుస్తున్నాడని, ఫ్రస్టేషన్తో ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నావని ప్రశ్నించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నల్లో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు ఎలా అప్పజెప్పిన గుట్టు బయటపడిందని, అందుకే ఫ్రస్టేషన్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నిగ్గ తీసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తున్నాడని అన్నారు. గురు–శిష్యుల బంధం బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తేలు రాజు, సర్పంచులు సంతోష్, భారతి, చిరంజీవి, బిఆర్ఎస్ నాయకులు సాగి సత్యం రావు, చిట్ల రమణ, ధరిశెట్టి రాజేష్, మారు సాయి రెడ్డి, అనంతుల గంగారెడ్డి, ఎండబెట్ల వర ప్రసాద్, భాస్కర్, బైరి మల్లేష్, జగన్, రమేష్, సాంబారి గంగాధర్, భీమా నర్సయ్య, తిరుపతి, జలంధర్, సుమన్ నాయక్, నరేష్, భాస్కర్ నాయక్, సురేష్, బిఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube