BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 06:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Sep, 2026 - 06:48 PM
20 వీక్షణలు

మధిర: మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం భరత్ విద్యాసంస్థల డైరెక్టర్ శీలం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు బంకమట్టితో వినాయక విగ్రహాల తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. అనంతరం మట్టి వినాయకుడి విగ్రహాలనే పూజిస్తామని, పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రసాయనాలు, ఇతర కాలుష్యకారక పదార్థాలతో తయారయ్యే విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భరత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై. కోటేశ్వరరావు, టి. ఉమ, కళా ఉపాధ్యాయురాలు వి. పూజిత, బెల్లంకొండ స్రవంతి, నీలిమ, ప్రియాంక తదితరులు పాల్గొని విద్యార్థులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.