www.ntodaynews.com
మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం | NTODAY NEWS
విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 1వ తేదీన చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే.
వీరిలో బోటు యజమాని చిన్నాను ఆదివారం ఓ వాణిజ్య నౌక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం విస్తృత స్థాయిలో శోధన కొనసాగుతోంది.
గాలింపు చర్యల్లో భారత తీర రక్షక దళం (ICGS) నౌకలు, మూడు హెలికాప్టర్లు, అలాగే ఈ-సర్వైలెన్స్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. సహాయక చర్యలను కోస్ట్గార్డ్ రీజినల్ ఆపరేషన్ స్టేషన్ నిరంతరం పర్యవేక్షిస్తూ, మత్స్యకారులను సురక్షితంగా గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తోంది.