మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా నూతి వెంకటేశం
మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా నూతి వెంకటేశం
అభినందనలు తెలిపిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో నూతి వెంకటేశం వర్గం ఘనవిజయం సాధించింది. నిన్న నిర్వహించిన పాలకవర్గ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాలకు గాను తొమ్మిది డైరెక్టర్ పీఠాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం అనంతరం గురువారం నిర్వహించిన నూతన కార్యవర్గ ఎంపిక ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడుగా నూతి వెంకటేశం ఉపాధ్యక్షుడు గా బైరగోని పెద్దస్వామి, కార్యదర్శి గుండెబోయిన రాజు ఎన్నికయ్యారు. నూతనంగా ఎంపికైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శి మాట్లాడుతూ తమపై నమ్మకంతో తొమ్మిదికి తొమ్మిది స్థానాల్లో గెలిపించిన మత్స్యకార సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని మత్స్యకారుల సంక్షేమానికి, సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కార్యవర్గ ఎంపిక అనంతరం గ్రామస్తులు, సంఘ సభ్యులు నూతన కార్యవర్గానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.