BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 05 September 2026, 12:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మునుకుళ్ళ గ్రామంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 12:57 PM
17 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో రీసర్వే ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను శనివారం రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ పంపిణీ చేశారు.

రైతులకు ఎటువంటి తప్పులు, పొరపాట్లు లేని భూ రికార్డులను అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల మంజూరు ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా మునుకుళ్ల గ్రామంలోని రైతుల భూములకు సంబంధించిన వివరాలను రీసర్వే ద్వారా పరిశీలించి, నమోదైన భూ వివరాల ఆధారంగా కొత్త పాస్‌పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో ఏ. కుమార్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేని భూ వివరాలతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రీసర్వే ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలను స్పష్టంగా నమోదు చేశామని చెప్పారు. భవిష్యత్తులో రైతులకు భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్, గ్రామ పెద్దలు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.