www.ntodaynews.com
ముసునూరులో జూద స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముసునూరు ఎస్ఐ ఎం. చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు చిల్లబోయినపల్లి గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు, 3 బైక్లు స్వాధీనం చేసుకోగా, రూ.12,500 నగదును సీజ్ చేశారు.
నిందితులపై ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మండలంలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.