www.ntodaynews.com
మున్సిపల్ ఎన్నికలకు మంత్రి అడ్లూరి శంఖారావం
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికలకు మంత్రి అడ్లూరి శంఖారావం
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్
కొండగట్టులో ప్రచార రథానికి ప్రత్యేక పూజలు
ఐదు మున్సిపాలిటీలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం
జగిత్యాల, కొండగట్టు, రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించింది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే క్షేత్రస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
గెలుపే లక్ష్యంగా ప్రణాళిక
జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మంత్రి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
లక్ష్య మున్సిపాలిటీలు:
జగిత్యాల
కోరుట్ల
మెట్పల్లి
ధర్మపురి
రాయికల్
అభివృద్ధి పనులే ప్రధాన అజెండా
ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల పరిధిలో మంత్రి విస్తృత పర్యటనలు చేస్తూ కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ప్రచారం సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రచార హోరుకు సిద్ధం
అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధం చేసిన ఈ ప్రచార రథం ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జిల్లా అంతటా ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. పార్టీ కేడర్ను సమన్వయం చేస్తూ ప్రజల్లో ప్రత్యక్షంగా మమేకమయ్యే విధంగా ప్రచార వ్యూహం రూపొందించారు.
#MunicipalElections
#CongressCampaign
#AddluriLaxmanKumar
#Kondagattu
#JagtialPolitics
#UrbanElections
#TelanganaPolitics
#PublicWelfare
#ElectionCampaign
Follow us on
Website
Facebook
Instagram
YouTube