BREAKING
చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
www.ntodaynews.com

మున్సిపల్ కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి:

తెలంగాణ
12 Feb, 2026 - 09:09 AM
249 వీక్షణలు
మున్సిపల్ కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ ఎన్నికలలో అత్యంత కీలక దశ అని పేర్కొన్న కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రాథమిక మరియు వివరణాత్మక లెక్కింపును నిర్వహించాలని సూచించారు. రూల్ 56 ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును పూర్తి చేయాలని తెలిపారు. యాక్ట్ 212 ప్రకారం సీక్రెసీ మెయింటెనెన్స్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కౌంటింగ్ ఏజెంట్లకు చూపించి, సంబంధిత సీల్ ట్రేలో సక్రమంగా వేయాలని స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగాలని సూచించారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం లెక్కింపును పూర్తి చేసి, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. #YadadriBhuvanagiri #MunicipalElections #VoteCounting #ElectionTraining #TelanganaNews #DistrictAdministration #LocalNews Follow us on Website Facebook Instagram YouTube