BREAKING
మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
Date of Publish : 11 September 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాగ్‌పూర్: బ్యాంకులో పట్టపగలే దొంగ హల్‌చల్.. కారం పొడి చల్లి రూ.4.5 లక్షలు చోరీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 07:19 PM
12 వీక్షణలు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పట్టపగలే ఓ దుండగుడు బ్యాంకులోకి చొరబడి నగదు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బ్యాంకు సిబ్బందిపై కారం పొడి చల్లి గందరగోళం సృష్టించిన దుండగుడు.. అదే అదునుగా కౌంటర్‌లో ఉన్న రూ.4.5 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. కారం పొడి కారణంగా బ్యాంకు సిబ్బంది ఇబ్బందులకు గురై ఉరుకులు పరుగులు పెట్టడంతో దుండగుడికి ఎదురులేకుండా పోయింది. నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న నేర విభాగం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు కేవలం అరగంటలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడి వద్ద నుంచి చోరీకి గురైన రూ.4.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టపగలే బ్యాంకులోకి చొరబడి కారం పొడి చల్లి నగదు దోచుకోవడం నాగ్‌పూర్‌లో తీవ్ర కలకలం రేపింది. ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.