BREAKING
మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
Date of Publish : 11 September 2026, 07:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 07:56 PM
10 వీక్షణలు

మధిర: వినాయక చవితి పండుగ సందర్భంగా మధిర మండలంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్ఠించే వారు తప్పనిసరిగా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని రూరల్ ఎస్సై విశ్వతేజ సూచించారు. ఉత్సవ కమిటీలు ఉచిత ఏకగవాక్ష విధానంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు స్థల యజమాని అనుమతితో పాటు పంచాయతీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. రహదారులకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా మండపాలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదన్నారు. లౌడ్‌స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. డీజేలు, మందుగుండు సామగ్రి వినియోగించరాదని హెచ్చరించారు. ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మద్యం, మత్తు పదార్థాలు సేవించి పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని రూరల్ ఎస్సై విశ్వతేజ హెచ్చరించారు.