కొడంగల్లో టీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ
కొడంగల్లో టీఆర్ఎస్కు జోష్.. పలువురు యువకులు, మహిళలు పార్టీలో చేరిక
కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గ నాయకులు రాజ ప్రభాకర్ కులకర్ణి ఆధ్వర్యంలో పలువురు యువకులు, మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పార్టీలోకి వస్తున్నారని నాయకులు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా చేరిన వారితో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తామని రాజ ప్రభాకర్ కులకర్ణి తెలిపారు. యువత, మహిళల చేరికతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.