నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు వర్ష సూచన
ఆగస్టు 31: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో సాయంత్రం వేళల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.