కంభంపాడులో కౌలు రైతు సంఘం ధర్నా....
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
కంభంపాడులో కౌలు రైతు సంఘం ధర్నా.. కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు సహకార సంఘం సొసైటీ వద్ద ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు.
ఎన్నికల ముందు కౌలు రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని కౌలు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. కౌలు రైతులకు పంట రుణాలు అందించాలని, వ్యవసాయ పెట్టుబడులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కౌలు రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. ధర్నాలో పలువురు రైతులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.