దమ్మైగూడలో వికలాంగుల కాలనీ సమస్యలపై సీపీఎం వినతి
దమ్మైగూడలో వికలాంగుల కాలనీ సమస్యలపై సీపీఎం వినతి
మౌలిక వసతులు కల్పించాలని ఎంఎంసీ ప్రజావాణిలో వినతి పత్రం అందజేత
మల్కాజ్గిరి: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కీసర సర్కిల్-01 పరిధిలోని దమ్మైగూడ డివిజన్-04 శ్రీ రామలింగేశ్వర కాలనీలో (వికలాంగుల కాలనీ) అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం కీసర మండల కమిటీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఎంఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో సీపీఎం కీసర మండల కమిటీ బృందం అధికారులకు వినతి పత్రం అందజేసింది. కాలనీలో నివసిస్తున్న వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినట్లు సీపీఎం కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం కీసర మండల నాయకులు శివన్నారాయణ, కలువల శ్రీనివాస్, నితిన్, కలమ్మ, తార, పోచమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు.