BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 31 August 2026, 04:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గద్వాలలో 21 ఏళ్ల తర్వాత న్యాయం కోసం తల్లి ధర్నా.. కొడుకు తండ్రిని అంగీకరించాలని డిమాండ్

తెలంగాణ
/ జోగులాంబ గద్వాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:14 PM
24 వీక్షణలు

గద్వాల జిల్లా: కొడుకు పుట్టిన 21 ఏళ్ల తర్వాత తన కుమారుడికి తండ్రి నువ్వేనంటూ ఓ మహిళ నిరసనకు దిగింది. తన కుమారుడిని వెంట పెట్టుకొని ధర్నా చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

గద్వాలకు చెందిన కృష్ణవేణి అనే మహిళ చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఓ కుటుంబంలో పనిచేసేదని తెలిపింది. వయసు వచ్చిన తర్వాత కూడా అదే ఇంట్లో పనిచేస్తుండగా, ఆ ఇంటి యజమాని కుమారుడు తనను లోబర్చుకొని గర్భవతిని చేశాడని ఆరోపించింది.

ఈ విషయం తెలిసిన తర్వాత గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించాడని, అయితే అది విఫలమైందని పేర్కొంది. అనంతరం జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి తనను అక్కడి నుంచి తీసుకెళ్లారని తెలిపింది.

ఆ తర్వాత తాను మగబిడ్డకు జన్మనిచ్చానని, గత 21 ఏళ్లుగా తన కుమారుడిని తన కొడుకుగా అంగీకరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. తనను బెదిరిస్తూ, దౌర్జన్యం చేస్తున్నారని, చేతబడి చేయించి చంపేస్తామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పటికైనా తన కుమారుడికి తండ్రిగా అతడు అంగీకరించి న్యాయం చేయాలని కృష్ణవేణి డిమాండ్ చేసింది. ఈ ఘటనపై అధికారుల జోక్యం కోరింది.