హైదరాబాద్లో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్లో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. నల్లరంగు పూసిన యూత్ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయానికి నల్లరంగు పూసి నిరసన తెలిపారు. ఆందోళనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో యూత్ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
బిహార్లో విద్యార్థులపై కాల్పులు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల అంశాలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.