BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 31 August 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గద్వాల మార్కెట్‌ యార్డులో భారీగా గంజాయి పట్టివేత

తెలంగాణ
/ జోగులాంబ గద్వాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:13 PM
18 వీక్షణలు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సుమారు 6 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు, దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది.

గంజాయి పట్టుబడిన ఘటనతో గద్వాల పట్టణంలో మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి వ్యాపారం జరుగుతోందా అనే అంశంపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, గంజాయి సరఫరా మార్గాలపై మరింత నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి రహిత గద్వాల కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.