కేసముద్రంలో రూ.1.90 కోట్ల విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో రూ.1.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో మొక్క నాటారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేంకట నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సిఎండి వరుణ్ రెడ్డి, ఎస్పీ డాక్టర్ శబరిష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఉప కేంద్రం అందుబాటులోకి రావడంతో కేసముద్రం మండల పరిధిలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు.