www.ntodaynews.com
నీట్ పేపర్ లీకేజీపై మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు, ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడటం తగదని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా, యువజన, ఎన్ఎస్ యూఐ అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు