BREAKING
13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
www.ntodaynews.com

నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
12 May, 2026 - 07:31 PM
94 వీక్షణలు

నీట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌   NTODAY NEWS చిట్యాల 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  నిర్వహిస్తున్న నీట్‌ పరీక్షల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అవ్యవస్థలు, పేపర్ లీకేజీలు దేశవ్యాప్తంగా ఉన్న 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షులు అరూరి ప్రణీత్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ​పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి, నగలు అమ్మి తమ పిల్లలను చదివిస్తుంటే, ఎన్‌టీఏ నిర్లక్ష్యం వల్ల వారి కలలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి అని పేర్కొన్నారు. పదేపదే వైఫల్యాలకు గురవుతున్న ఎన్‌టీఏను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ​నీట్ పేపర్ లీకేజీలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని,  ​బాధిత 22 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చెయ్యాలి అని డిమాండ్ చేశారు. ​భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన,  పరీక్షా విధానాన్ని  తీసుకురావాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాలని అరూరి ప్రణీత్ డిమాండ్ చేశారు.