BREAKING
వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు
www.ntodaynews.com

నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 03:20 PM
16 వీక్షణలు

నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

నవనీత కృష్ణ అలంకారంలో దర్శనమివ్వనున్న స్వామివారు.. ఉట్టి ఉత్సవానికి ఏర్పాట్లు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారు "నవనీత కృష్ణ" అలంకార రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో సంధ్య తెలిపారు. సాయంత్రం వేళ సంప్రదాయబద్ధంగా ఉట్టి ఉత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో గోపూజ, వేణుగోపాలస్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా స్వామివారికి తొమ్మిది రకాల ప్రసాదాలను నివేదించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు టి.గోపాలచార్యులు వివరించారు.

అదేవిధంగా సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దేవస్థానంలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు.