రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల సన్న వరిని సాగు చేసే రైతులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఎన్. దుర్గేశ్వరి అన్నారు. మంగళవారం మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల వరి వంగడాలైనా బీపీటీ 5204, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 77 15, జైశ్రీ రామ్, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్ 44, తెలంగాణ సోనా రకాలను సాగు చేసే
రైతులు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద వెంటనే ఆన్లైన్లో నమోదు చేసుకోవాల న్నారు. రైతులు సొంతంగా, ఇతర మార్గా లతో విత్తనాలు పొంది సాగు చేస్తే సంబం ధిత రైతు వేదిక వద్ద స్వయంగా ధ్రువీకరణ పత్రాలతో సెప్టెంబర్ 10 లోపు నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో నమో దు చేస్తేనే ప్రభుత్వ బోనస్ రూ.500లు వర్తిస్తుందని తెలిపారు.