బస్సులోకి దూసుకెళ్లిన ఐరన్ రాడ్లు : ఐదుగురు మృతి
బస్సులోకి దూసుకెళ్లిన ఐరన్ రాడ్లు : ఐదుగురు మృతి
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలోని ఐరన్ రాడ్లు బస్సులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్కు చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం. తెలుస్తోంది ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.