BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

చిట్యాల టీటీడీ కళ్యాణ మండపం భూమిపై డిజిటల్‌ సర్వే పూర్తి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 Aug, 2026 - 08:50 AM
76 వీక్షణలు

చిట్యాల టీటీడీ కళ్యాణ మండపం భూమిపై డిజిటల్‌ సర్వే పూర్తి

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం 2002లో కేటాయించిన భూమిపై డిజిటల్‌ సర్వే ప్రక్రియ పూర్తయింది. ఎమ్మార్వో విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గురులింగం ఆధ్వర్యంలో సర్వే అధికారులు మంగళవారం భూమిని డిజిటల్‌ పద్ధతిలో సర్వే చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు గతంలో టీటీడీ కళ్యాణ మండపం కోసం కేటాయించిన 1 ఎకరం 12 గుంటల భూమిపై శనివారం ప్రాథమిక సర్వే నిర్వహించినట్లు ఎమ్మార్వో విజయ్‌కుమార్‌ తెలిపారు. అగ్రిమెంట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం భూమి విస్తీర్ణం 1 ఎకరం 12 గుంటలుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. సర్వేయర్‌ పూర్తి నివేదిక అందిన అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి భూమి హద్దులను అధికారికంగా నిర్ధారిస్తామని ఎమ్మార్వో పేర్కొన్నారు. అనంతరం పూర్తి సర్వే నివేదికను శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంకు అందజేస్తామని తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో ఆర్‌ఐ జానీ షరీఫ్‌, సర్వేయర్‌ రజనీకాంత్‌, జీపీఓ రెహమాన్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.