మిలాద్-ఉన్-నబీ సందర్భంగా మంచిర్యాలలో ఘనంగా ర్యాలీ..
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా మంచిర్యాలలో ఘనంగా ర్యాలీ..
మంచిర్యాల నియోజకవర్గం..
పవిత్రమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి చౌరస్తా వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు పండ్లు, తాగునీరు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ ఖలీద్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, పీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్చార్జి నూకల రమేష్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు మీనాజ్, మక్బుల్, కాల్వల జగన్ రావు, మాజీ కౌన్సిలర్ మీనాజ్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జలీల్, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమ, సోదరభావం, శాంతి, సామరస్యాలు సమాజంలో మరింతగా విరాజిల్లాలని ఆకాంక్షించారు.
మత సామరస్యం – సోదరభావం – శాంతి సమాజానికి బలమైన పునాది