www.ntodaynews.com
నిస్వార్థ సేవకు ఉత్తమ ప్రశంసా పత్రాలు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
నిస్వార్థ సేవకు ఉత్తమ ప్రశంసా పత్రాలు...
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చౌడేపల్లి మండలానికి చెందిన పలువురు అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. హోం శాఖ లో పుంగనూరు రూలర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్,దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్,బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈఓ ఏకాంబరంలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భరత్, పరికిదొన గ్రామ రెవెన్యూ అధికారి జీవన జ్యోతి,గ్రామ సర్వేయర్ విజయ్ కుమార్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.అలాగే తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి, ఏ.కొత్తకోట గ్రామ రెవెన్యూ అధికారి సుప్రియ,గడ్డంవారిపల్లి గ్రామ రెవెన్యూ సహాయకులు రెడ్డిరత్నంలు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఆరోగ్య శాఖకు చెందిన చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆప్తమాలిక్ అసిస్టెంట్ రహమత్ అలీఖాన్, లద్దిగం ఏఎన్ఎం హేమలతలు కూడా సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను సహచర ఉద్యోగులు,స్థానికులు అభినందించారు.