నియోజకవర్గ జెఏసీ చైర్మన్గా రహమత్ అలీఖాన్...
నియోజకవర్గ జెఏసీ చైర్మన్గా రహమత్ అలీఖాన్...
అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం విశ్రాంత ఉద్యోగుల భవన్లో జిల్లా చైర్మన్ రాఘవులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.జెఏసీ సంఘ నియోజకవర్గ కార్యదర్శిగా బుడ్డన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ చైర్మన్లుగా అయూబ్ఖాన్, జగన్నాథరాజు, సాహెబ్, శివకుమార్లు , జాయింట్ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రేజరర్గా శ్రీనివాసులును ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ప్రసాద్బాబు, భాస్కర్రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులను జెఏసీ ఉద్యోగులు పూలమాలలు వేసి సన్మానించారు. నూతన జెఏసీ చైర్మన్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ , కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తామని తెలిపారు. జెఏసీ సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటాలు చేయడానికి సిద్ధం అన్నారు.జెఏసి సభ్యులందరికి అండగా ఉంటామని హామి ఇచ్చారు.