BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 12:18 PM
45 వీక్షణలు

నంద్యాల జిల్లా  07.04.2026  పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 80 ఫిర్యాదులు...   విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం 


పోలీస్ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి 80 ఫిర్యాదులు... 

విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం...... 

ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ... 

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం (06-04-2026) నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)" కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు ఫిర్యాదిదారుల నుంచి 80 ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ గారు స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు

1). 25-03-26 తేదీన నంద్యాల నుండి అనంతపురం వెళ్ళుటకు నంద్యాలలో బస్సులు ఎక్కడం జరిగింది. బస్సులో ఎక్కువ రద్దీ ఉండడంతో బంగారు నగలతో ఉన్న బ్యాగు డ్రైవర్ వెనక సీట్లో లో కూర్చున్న ఇద్దరు మహిళలు ఇవ్వడం జరిగింది. కొన్ని నిమిషాల్లో మేము వెంటనే వాటిని తీసుకున్నాము. కానీ మేము ధర్మవరం వెళ్లి చూడగా బ్యాగులోని లోని పర్సులో బంగారు నగలు కనపడటం లేదు కావున పోయిన మా బంగారు నగల్ని కనిపెట్టి మాకు న్యాయం చేయాలని నంద్యాల Activities చెందిన సాయి చైతన్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

2). నాకు ఉద్యోగం ఇప్పిస్తానని నా వద్ద నుండి రెండు లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన బెంగళూరు జాబ్ కన్సల్టెన్సీకి కి చెందిన బుక్కి సేవల నాయక్ పై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండని నంద్యాల టౌన్ జ్ఞానాపురం కు చెందిన లావణ్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.


3). నేను 2024లో కొండారెడ్డి అను వ్యక్తి దగ్గర నుండి 25 లక్షలకు వరుకోత మిషన్ కొన్నాను, దానికి సంబంధించిన స్పేర్ సామాన్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఎక్కువగా రిపేర్లు వస్తుందని చెప్పినా, స్పందించడం లేదని నాకు న్యాయం చేయండని నెహ్రు నగర్ కు చెందిన వంశీ కుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.