BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

నంద్యాలలో పలుదొంగ తనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
03 Apr, 2026 - 07:20 PM
31 వీక్షణలు

నంద్యాలలో పలుదొంగ తనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు 

 నంద్యాల జిల్లాలో పలు పోలీసు స్టేషన్ ల  పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్..... 

15 లక్షల విలువచేసే బంగారు వెండి నాగాలతో పాటు నగదు స్వాదినం...... 

నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షోరాణ్ I.P.S 

ముద్దాయి వివరాలు

 షేక్ బాబావలి, తండ్రి షేక్ కరీముల్లా, వయస్సు 25 సం లు, YSR నగర్, ఇంటి నెంబర్ 25-450-2B-109, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా.

రికవరీ చేసిన సొత్తు వివరాలు

 98 గ్రాముల బంగారు నగలను, 400 గ్రాముల వెండి వస్తువులను మరియు 54,500/-నగదు, మొత్తం విలువ సుమారు 15 లక్షలు స్వాదినం చేసుకోవడం జరిగింది.

2025 వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలలో అనగా నంద్యాల తాలూకా ,బండిఆత్మకూరు,రేవనూరు,సంజామల,గడివేముల,బేతంచర్ల,అవుకు మొదలగు పోలీసు స్టేషన్ ల పరీదులలో  దొంగతనాలకు పాల్పడుతూన్న నేరస్తుల గురుంచి నిఘా ఉంచాలని నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షోరాణ్ I.P.S ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP కుమారి ఎం. జావళి ఆల్పోన్స్ IPS ఆద్వర్యంలో నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ శ్రీ R.ఈశ్వరయ్య , CCS ఇన్స్పెక్టర్ P.సురేష్ కుమార్ నిఘా ఉంచడం జరిగింది.

ఈ దినం అనగా 03.04.2026 వ తేదీ వె నందమూరి నగర్ రోడ్, నాగులకట్ట దగ్గర వున్న T జంక్షను వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నంబర్ ప్లేట్ లేని పల్సర్ మోటార్ సైకల్ వస్తు పోలీసు వారిని చూసి మోటార్ సైకల్ ను తిప్పుకొని పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని పట్టుకొని విచారించడం జరిగింది.

ఇతడు జల్సాలకు అలవాటుపడి పలు పోలీసు స్టేషన్ ల పరీదులలో దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతు ఉండేవాడు.

ఈ సందర్బంగా నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ షోరాణ్ I.P.S గారి, మరియు నంద్యాల సబ్ డివిజన్ ASP కుమారి M. జావళి ఆల్పోన్స్ IPS  గారు నిందితుని అరెస్ట్ లో కీలక పాత్ర పోషిoచిన నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ శ్రీ R.ఈశ్వరయ్య గారు, CCS ఇన్స్పెక్టర్ P.సురేష్ కుమార్ గారు ,నంద్యాల తాలూకా PS సిబ్బంది, PCs B.రవికుమార్, M.గంగాధర్ మరియు CCS సిబ్బంది HCs, ఇబ్రహిం, PCs మలిక్ బాష, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, గంగారం మరియు కృష్ణమ నాయుడు లను ప్రత్యేకముగా అభినందించడమైనది.

జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల.