BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 07:14 PM
333 వీక్షణలు

నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా చాట్రాయి మండలం నుంచి అత్తులూరి శ్రీనివాసరావు, నక్కా సితారత్నం ఎంపిక

నూజివీడు (ఏలూరు జిల్లా): నూజివీడు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, సీనియర్ అడ్వకేట్ అత్తులూరి శ్రీనివాసరావు మరియు చనుబండ గ్రామానికి చెందిన నక్కా సితారత్నం ను ఎంపిక చేసినట్లు సమాచార శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు. ఈ నిర్ణయంతో నూజివీడు నియోజకవర్గం ఆర్యవైశ్య, దళిత సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, "మంత్రి కొలుసు పార్థసారధి  తనపై నమ్మకంగా పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుకుంటానని" తెలిపారు. "ఈ పదవి ఇచ్చినందుకు మంత్రి కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అన్నారు. నక్కా రాము మాట్లాడుతూ తనకు ఈ గౌరవం ఇచ్చి తన మాతృ మూర్తి కి ఈ పదవి ఇచ్చినందుకు మంత్రి కి రుణపడి ఉంటానని చెప్పారు. ఈ నియామకానికి చనుబండ పంచాయతీ నుండి పిఎసిసిఎస్ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు చీదిరాల మారేశ్వర రావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, ములగలపాటి శ్రీనివాస రావు, బొట్టు దుర్గారావు, బొంతు సతీష్, మోరంపూడి రమేష్, దార్ల సురేష్ బాబు, మోద్గా ముత్తయ్య, గౌర వెంకటేశ్వరరావు, నక్కా చెన్నారావు తదితర టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకం, నూజివీడు నియోజకవర్గంలో సక్రమమైన పాలన మరియు దళితుల హక్కుల పరిరక్షణలో కీలక మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంది.