BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 15 April 2026, 05:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో బెల్ట్ షాపులపై దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 05:48 PM
189 వీక్షణలు

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలన కోసం బెల్ట్ షాపులపై దాడులు

ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, నాటు సారాను నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రారంభించిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా, బెల్ట్ షాపులపై సన్నద్ధతగా చర్యలు తీసుకుంటున్నారు.ఈ చర్యలో భాగంగా, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ బి.శ్రీలత, ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కే. నాగ ప్రభు కుమార్, మరియు ఏలూరు జిల్లా డిస్టిక్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ ఎ.అవులయ్య వారి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి.హెచ్. అజయ్ కుమార్ సింగ్ మరియు ఇతర సిబ్బంది చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా గ్రామంలో దాడులు నిర్వహించారు.ఈ దాడిలో:1.భానవతు పుట్లమ్మ భర్త మోషే వద్ద 3 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు, అలాగే 50 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 2.ధరావతు లక్ష్మి భర్త బద్దు వద్ద 1 లీటరు నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఇద్దరి పై కేసులు నమోదు చేసారు.ఇంకా, నాటు సారాయి తయారీకి సంబంధించిన వ్యాపారులు మరియు బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు తెలిపారు. నాటు సారా నిర్మూలనలో ప్రజల సహకారాన్ని కోరుతూ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య గారు ప్రజలకు గోప్యంగా సమాచారం ఇవ్వాలని సూచించారు.ఫోన్ నెంబర్ 9440902462 కు సమాచారాన్ని అందించడమనే వివరాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ చర్యలు, ఆంధ్రప్రదేశ్ లో నాటు సారాయి నిర్మూలన కోసం తీసుకుంటున్న నిర్ణాత్మకమైన అడుగులు.