BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

నూజివీడులో మనసులో మాట 132వ ఎపిసోడ్ వీక్షణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:48 PM
115 వీక్షణలు

నూజివీడులో ‘మనసులో మాట’ 132వ ఎపిసోడ్ వీక్షణ కార్యక్రమం

నూజివీడు: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మనసులో మాట’ (మన్ కీ బాత్) 132వ ఎపిసోడ్‌ను నూజివీడులో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పనతల సురేష్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

నూజివీడులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు హాస్టల్‌లో 8, 9వ తరగతి బాలికలతో కలిసి టీవీ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. విద్య కేవలం పుస్తక జ్ఞానంగా కాకుండా జీవన నైపుణ్యాలను పెంపొందించే సాధనంగా ఉండాలని అన్నారు. స్కిల్ ఇండియా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, మాతృభాషలో విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, డిజిటల్ మరియు ఆన్‌లైన్ విద్యను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వంటి అంశాలను ప్రస్తావించారు.

విద్యార్థులు కేవలం మార్కులకు మాత్రమే పరిమితం కాకుండా క్రీడలు, కళలు, నైతిక విలువలు, టెక్నాలజీ పరిజ్ఞానం వంటి విభిన్న రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యారంగమే పునాది అని చెప్పారు.

పాఠశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11:30 గంటలకు అన్ని తరగతుల బాలికలకు ఎల్ఈడి స్క్రీన్‌లపై ‘మనసులో మాట’ కార్యక్రమాన్ని చూపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు సాధారణ జ్ఞానం ప్రశ్నలు అడిగి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చాగంటి వాసుదేవరావు, వసుంధర దేవి, మాగంటి వాసుదేవరావు దంపతులు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు టి రాజేంద్ర ప్రసాద్, నూజివీడు టౌన్ ప్రధాన కార్యదర్శులు జగదీష్, సూర్యప్రకాశ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు.