నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి..
నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి..
డొంకేశ్వర్: మండలంలోనీ అన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం లబ్దిదారులు రెడ్డి ప్రియాంక, రెడ్డి పద్మా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని mla రాకేష్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ అభినవ్ మాల్వా ఆధ్వర్యంలో నిర్వహించారు..
ఈ సందర్భంగా mla రాకేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు..
Mla మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆశ సొంత ఇల్లు ఉండడమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని ఆశతో కార్యక్రమాలు చేపడుతుందని పేరు ఏదైనా కార్యక్రమం ఒకటే అని అన్నారు..
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు mla రాకేష్ రెడ్డిని శాలువాతో సత్కరించారు..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు,మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.