నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
NTODAY NEWS యాదాద్రి భువనగిరి జిల్లా
వెల్లంకి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచబోయిన ప్రశాంత్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వివాహం అనేది రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని, వధూవరులు జీవితాంతం ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ సెక్రటరీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి, రామన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి మల్లారెడ్డి, మండల నాయకులు గంగుల రాజిరెడ్డి, పున్న జగన్, నంద్యాల భిక్షం రెడ్డి, వెల్లంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రె రమేష్, పోచబోయిన నర్సింహ, సాగర్ల సాయి, పోచబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుకకు హాజరైన నాయకులు, కార్యకర్తలు నూతన దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఈ వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.