BREAKING
ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

కరీంనగర్‌లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం గీతం కార్డుల పంపిణీ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 01:59 PM
20 వీక్షణలు

కరీంనగర్‌లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం గీతం కార్డుల పంపిణీ

కరీంనగర్: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం పూర్తి గీతం కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్, సప్తగిరి పాఠశాలలకు చెందిన 1200 మంది విద్యార్థులకు ఈ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజ్ఞాభారతి రాష్ట్ర గవర్నర్ కౌన్సిల్ సభ్యుడు ఎల్. రాజ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1870లో బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఏకం చేసిన మహా రణనినాదంగా నిలిచిందని తెలిపారు. ఈ గీతం దేశభక్తికి, మాతృభూమిపై ఉన్న గౌరవానికి ప్రతీకగా మారిందని వివరించారు.

భారత ప్రభుత్వం వందేమాతరం గీతాన్ని గౌరవనీయమైన జాతీయ గేయంగా స్వీకరించిందని పేర్కొన్నారు. యువతలో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి కోశాధికారి జె. సత్యనారాయణ, సహాయ కార్యదర్శి వెచ్చా మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.