www.ntodaynews.com
నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి విడదల రజిని
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి విడదల రజిని
యడ్లపాడు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండ్ల పున్నారావు, రాజశేఖర్ సోదరి భవానీ వివాహం గురువారం సాయంత్రం క్రోసూరు మండలం యర్రబాలెంలో జరగనుంది. ఈ నేపథ్యంలో, గురువారం యడ్లపాడు గ్రామంలోని బండ్ల పున్నారావు నివాసానికి మాజీ మంత్రివర్యులు విడదల రజిని వెళ్లారు. అక్కడ పెళ్లి కుమార్తె భవానీని కలిసి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పున్నారావు కుటుంబ సభ్యులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.