www.ntodaynews.com
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ
తెలంగాణ
అడవినాథునికుంటలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు
పుంగనూరు: మండల పరిధిలోని అడవినాథునికుంటలో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హ్యాండ్ వాష్ కమ్ డెవర్మింగ్ డే కార్యక్రమం నిర్వహించారు.
మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యంగా ఉన్న 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండాజోల్ మాత్ర పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఫిబ్రవరి 24, 2026న మాత్ర అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రైవేట్గా ఈ మాత్ర ధర రూ.25 కాగా, ప్రభుత్వ కార్యక్రమంలో ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రక్తహీనత నివారణకు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం ఉపయోగకరమని వైద్య సిబ్బంది తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డా. పవన్ కుమార్, ఏపీ మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ సదా రెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ లోకనాథం, ఉపాధ్యాయులు, వైద్య మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
#NationalDewormingDay #HealthAwareness #SchoolHealthProgram #AnnamayyaDistrict #Punganur #HandWashDay #PublicHealth #ChildCare
Follow us on
Website
Facebook
Instagram
YouTube