BREAKING
కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక
www.ntodaynews.com

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ

తెలంగాణ
17 Feb, 2026 - 08:01 PM
62 వీక్షణలు
అడవినాథునికుంటలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు: మండల పరిధిలోని అడవినాథునికుంటలో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హ్యాండ్ వాష్ కమ్ డెవర్మింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యంగా ఉన్న 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండాజోల్ మాత్ర పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఫిబ్రవరి 24, 2026న మాత్ర అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్‌గా ఈ మాత్ర ధర రూ.25 కాగా, ప్రభుత్వ కార్యక్రమంలో ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రక్తహీనత నివారణకు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం ఉపయోగకరమని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా. పవన్ కుమార్, ఏపీ మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ సదా రెడ్డి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ లోకనాథం, ఉపాధ్యాయులు, వైద్య మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. #NationalDewormingDay #HealthAwareness #SchoolHealthProgram #AnnamayyaDistrict #Punganur #HandWashDay #PublicHealth #ChildCare Follow us on Website Facebook Instagram YouTube