ఎమ్మెల్యేను కలసిన రెబ్బెనపల్లి మత్స్య శాఖ సొసైటీ నూతన కమిటీ
నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల | Ntoday News
మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం రెబ్బెనపల్లి హరిజన మత్స్య శాఖ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
సొసైటీ అధ్యక్షుడిగా మొదంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షుడిగా కుశానపల్లి రాజం, ప్రధాన కార్యదర్శిగా కుశానపల్లి నర్సయ్య, డైరెక్టర్లుగా రాజయ్య, రాజలింగు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసి అభినందనలు స్వీకరించారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ప్రేమ్ సాగర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మత్స్య శాఖ సొసైటీ అభివృద్ధికి నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.