BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
www.ntodaynews.com

అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణ
30 Nov, 2025 - 05:18 AM
170 వీక్షణలు

చిట్యాల మండలంలో అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు సెగ్మెంట్ లో అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్లు ప్రక్రియ కొనసాగింది అర్ధరాత్రి 12 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు కావడంతో వెలిమినేడు సెగ్మెంట్ లోని బొంగోని చెరువు, పిట్టంపల్లి, వెలిమినేడు గ్రామపంచాయతీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయటానికి భారీగా ఆసక్తి చూపారు. వెలిమినేడు మేజర్ గ్రామపంచాయతీ కావటంతో అభ్యర్థులు అత్యధికంగా నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపారు . ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎన్నికల సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. నామినేషన్ల వివరాలు చిట్యాల మండలంలో 18 గ్రామ పంచాయతీలకు 150 సర్పంచ్ అభ్యర్థులు, 180 వార్డులకు గాను 595 వార్డు మెంబర్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారని ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. శనివారం నామినేషన్ల చివరి రోజు కావడంతో పలుచోట్ల రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. చిట్యాల మండలంలోని ఆరు సెగ్మెంట్ లలో మొత్తం 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ కు గాను 150 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా 180 వార్డులకు గాను 595 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు Follow us on Website Facebook Instagram YouTube