BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ఉమా కుక్కుటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

తెలంగాణ
13 Feb, 2026 - 03:41 AM
197 వీక్షణలు
ఉమా కుక్కుటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి  పిఠాపురం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం పాదగయ క్షేత్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్ తరఫున ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ ఇంచార్జ్ డా. చిక్కాల వరలక్ష్మి రమణారావు తదితరులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, మంగళవాయిద్యాలతో సాయంత్రం నిర్వహించిన దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈ సమర్పణ జరిగింది. కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం పాదగయ క్షేత్రంలో కోనేరు పరిశుభ్రత, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా అంకురార్పణతో ప్రారంభమైన ఉత్సవాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయని, నిత్య కళ్యాణాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విఐపీ దర్శనాలు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే నిర్వహిస్తామని, సాధారణ భక్తులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 20 మంది సభ్యులతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #Pithapuram #KakinadaDistrict #UmaKukkuteswaraSwamy #MahaShivaratri #JanasenaParty #TempleNews Follow us on Website Facebook Instagram YouTube